Pages

Tuesday, May 24, 2011

అపూర్వ స్వాగతం

విజయనగరం, న్యూస్‌లైన్ : కడప ఉప ఎన్నికల్లో విజయదుందుభి మోగించి, తొలిసారిగా విజయనగరం జిల్లాలో అడుగుపెట్టిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అఖండ స్వాగతం లభించింది. జిల్లా సరిహద్దులోని రాజపులోవ జంక్షన్ వద్ద రాష్ట్ర, జిల్లా నాయకులు ఘనంగా ఆయనకు స్వాగతం పలి కారు. అనకాపల్లి ఎంపీ సబ్బం హరితో కలిసి మలి విడత ఓదార్పునకు జిల్లాకు వచ్చిన యువనేత జగన్‌కు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు పెనుమత్స సాంబశివరాజు, డాక్టర్ పెద్దింటి జగన్మోహనరావు, మాజీ ఎమ్మెల్యేలు కుంభా రవిబాబు, తాడ్డి వెంకటరావు, పాయకరావుపేట ఎమ్మెల్యే బాబూరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ అవనాపు సూరిబాబు, కాపారపు శివున్నాయుడు, జెడ్పీ మాజీ చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కాకర్లపూడి శ్రీనివాసరాజు, సుబ్బరాజు, వాసిరెడ్డి తిలక్ కిరణ్‌కుమార్ స్వాగతం పలికారు. 

వారితో పాటు రిటైర్డు జిల్లా వైద్యాధికారి డాక్టర్ బొత్స కాశీనాయుడు, గజపతినగరం పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ పెద్ది నాయు డు, డాక్టర్ గేదెల తిరుపతిరావు, వ్యాచలపు చినరామునాయుడు, చేనేత సంఘ రాష్ట్ర నాయకుడు వానపల్లి సత్యం నాయుడు, కొత్తవలస మాజీ ఎంపీపీ దమయంతి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు డి.శంకర సీతారామరాజు (సింగ్‌బాబు), గొర్లె వెంకటరమణ, మొయిద ఎంపీటీసీ సభ్యుడు పెనుమత్స సూర్యనారాయణ రాజు (సురేష్), అవనాపు విజయ్, విక్రమ్, చెన్నా లక్ష్మి, గంట్యా డ మండల కోర్ కమిటీ నాయకులు బి.సత్యనారాయణ, లంక శ్రీను, ఎల్.కె.నాయుడు, విద్యాసంస్థల అధినేత ఎం. ఎస్.ఎన్., కొర్లాం మాజీ సర్పంచ్ సన్యాసినాయుడు, వాకాడ త్రినాథ, శ్రీకాకుళం జిల్లా నేత లు పీఎంజే బాబు, హనుమంతు కిరణ్‌కుమార్, మెంటాడ పద్మశ్రీ, పైడి కృష్ణప్రసాద్, వాసిరెడ్డి వెంకటనాయుడు, పొందూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కూన మంగమ్మ, బొమ్మాళి ఫణికుమార్, విశాఖకు చెందిన వి.శ్రీనివాసరావు, నూకం నాయుడు, వి.నర్సింగమూర్తి, పి. ఝాన్సీ, మేకపాటికి చెందిన షేక్ ఖాజాతేర్ తదితరులు జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

No comments:

Post a Comment