Pages

Tuesday, May 24, 2011

ఓదార్పు యాత్రపై విస్తృత ప్రచారం


గుమ్మలక్ష్మీపురం రూరల్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాంతంలో ఈ నెల 29న చేపట్టనున్న ఓదార్పుయాత్ర విజయవంతానికి కృషి చేస్తున్నామని ఆ పార్టీ నాయకుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ చెప్పారు. ఎల్విన్‌పేటలో ఓదార్పుయాత్రకు సంబంధించి ప్రచారానికి మంగళవారం వచ్చిన ఆయన ఆ పార్టీ స్థానిక కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. కార్యకర్తలు ఓదార్పుయాత్రకు సంబంధించి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. 

భద్రగిరికి చెందిన పెదపెంకి మురళీరావు అనే అభిమాని పార్టీ కార్యాలయానికి భవనాన్ని సమకూర్చారని చెప్పారు. వైఎస్‌ఆర్ మరణవార్త విని మృతి చెందిన కాకితాడ గ్రామానికి చెందిన ఆరిక భాస్కరరావు, ఉదయపురం గ్రామానికి చెందిన పత్తిక స్వప్న కుటుంబాలను జగన్‌మోహన్‌రెడ్డి ఓదారుస్తారని, ఆయా గ్రామాలకు వెళ్లి వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నామని చెప్పారు. ఆయన వెంట ఆ పార్టీ నాయకులు కుంబురిక దీనమయ్య, పి.వెంకటరావు, నిమ్మల గోపాల్, కొండగొర్రి నాగేశ్వరరావు ఉన్నారు.

No comments:

Post a Comment