Pages

Tuesday, May 24, 2011

వందలాదిగా... వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లోకి!

బలిజిపేట రూరల్, న్యూస్‌లైన్: మండలంలో పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీ కుటుంబాలు వందలాదిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాయి. మిర్తివలస గ్రామంలో 200 కుటుంబాలు ఆ పార్టీలో మంగళవారం చేరాయి. ఆ పార్టీ నాయకులు డాక్టర్ బొత్స కాశినాయుడు, పాలవలస మురళీకృష్ణ ఆధ్వర్యంలో వారంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కాశినాయుడు, పాలవలస మురళీకృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. 

పార్టీలో చేరిన వారిలో పంచాయతీ సభ్యుడు గునపర్తి పకీరు, మత్స్య శాఖ డెరైక్టర్, మండల రజక సంఘం కార్యదర్శి యలమంచిలి రమణ, పంచాయతీ మాజీ సభ్యుడు గండబండు గంగయ్య, కో ఆపరేటివ్ మాజీ డెరైక్టర్ సాలీల లచ్చయ్య, పాలకేంద్రం డెరైక్టర్ గన్ను నారాయణరావు, యాదవ సంఘం ఉపాధ్యక్షుడు మార్సి గంగయ్యతో పాటు గుడుపూరు అప్పలనరసయ్య, సాలీల కృష్ణ, రాములు, ఎల్లయ్య, పోలిరాజు, రాము, జి.సింహాచలం, ఏకల అప్పలస్వామి, ప్రగడ సూర్యనారాయణ, అప్పలనరసయ్య, గణపతి, మానం అప్పారావు, ప్రగడ ఆదినారాయణ, బోగి సాయిరాం ఉన్నారు. 

వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లోకి...
విజయనగరం: చెరకుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు చిట్టి భాస్కరరావు, టీడీపీ నాయకులు సరగడ రాము, దుంప అప్పారావు, వాకాడ కొండమ్మ, లింగాలవలస మాజీ ఉప సర్పంచ్ రామినాయుడు ఆధ్వర్యంలో ఆ గ్రామస్థులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెడ్డికంచేరు గ్రామంలో శీరపు గురునాథరెడ్డి, కరయ్య్రరెడ్డి ఆధ్వర్యంలో మైలపల్లి యల్లారావు, సొసైటీ అధ్యక్షుడు కారి జంగాలతోపాటు 400 కుటుంబాలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరాయి. మైలపల్లి అప్పలస్వామి, అమర అప్పన్న ఆధ్వర్యంలో మరో వంద కుటుంబాలు, బోయిలపాలెంలో బోయి గురువులు, నర్సమ్మ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు, దిబ్బలపాలెంలో దల్లి అప్పలరాయుడు, నేలాపు లక్ష్మణ ఆధ్వర్యంలో వంద కుటుంబాలు పార్టీలో చేరాయి.

No comments:

Post a Comment