Pages

Wednesday, May 25, 2011

విజయనగరం news

సీతారాముల సేవలో జగన్
నెల్లిమర్ల రూరల్, న్యూస్‌లైన్ : ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన రామతీర్థంలోని శ్రీసీతారామస్వామిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ గల బేడాలో ఆయన ప్రదక్షిణ చేశారు. ఆలయంలోని మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పది మంది అర్చకులు జననేత పేరిట స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి పాదాలచెంత ఉంచిన పూలమాలలను జగన్‌మోహన్ రెడ్డితో పాటు అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజులకు వేశారు.

గర్భగుడి పక్కన ఉన్న ఉత్సవ మూర్తుల వద్ద జననేత పేరిట పూజలు చేసి, ఆయనను ఆశీర్వదించారు. ఆలయ విశేషాలను స్థానిక సిబ్బంది జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. అభివృద్ధి పనులను సిబ్బంది వివరించినపుడు సబ్బం హరి, కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ ఉత్తర రాజగోపుర నిర్మాణ పనులు ఎందుకు ఆలస్యమయ్యాయని ప్రశ్నించారు. సాంబశివరాజు హయాంలోనే ఆలయ అభివృద్ధికి టీటీడీ నుంచి ఈ నిధులను మంజూరు చేసినట్టు గుర్తు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి రామతీర్థం దర్శనానికి వస్తున్నారని తెలిసి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సుమారు అరగంట సేపు పూజలు జరిపించిన జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వచ్చేంత వరకు వారు నిరీక్షించారు. వచ్చిన తర్వాత జననేతకు జేజేలు పలుకుతూ అభివాదం చేశారు.

వైఎస్ బతికుంటే సస్యశ్యామలం.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే సుజల స్రవంతి ప్రాజెక్టుతో ఉత్తరాంధ్ర జిల్లాలు సస్యశ్యామలమయ్యేవని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇప్పుడా ప్రాజెక్టును ఏ నాయకుడూ పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఓదార్పు యాత్రలో భాగంగా బుధవారం రాత్రి నెల్లిమర్లలోని మొయిద జంక్షన్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వంపై కడప ఎంపీ నిప్పులు చెరిగారు. మహానేత వైఎస్సార్ మహోన్నత ఆశయంతో సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తే...ప్రస్తుత పాలకులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపించారు. అనేక సంక్షేమ పథకాలకు నేటి పాలకులు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దిగిపోతే బాగుంటుందని ప్రజలు భావిస్తుంటే... ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం మొసలి కన్నీరు కారుస్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి చేయాలనుకుంటే అవిశ్వాసం పెట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. చంద్రబాబు ఆ దిశగా ఆలోచించడం లేదని ఆరోపించారు. అవిశ్వాసం పెడితే జగన్ వర్గ ఎమ్మెల్యేలు ఏం చేస్తారోనన్న భయం పట్టుకుందన్నారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో ఉన్న తాము స్వార్థపూరిత రాజకీయాలు చేయబోమని, సంపూర్ణ మద్దతిస్తామని ప్రకటించారు. ఇప్పటికైనా ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యల దృష్ట్యా అవిశ్వాసంపై నోటీసు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ముఖ్యంగా ధాన్యం మద్దతు ధర, కొనుగోలు, విద్యార్థుల చదువులకు కేటాయించాల్సిన నిధులు...మహిళలకు చెల్లించాల్సిన పావలా వడ్డీపైన ప్రభుత్వాన్ని నిలదీసేలా వ్యవహరించాలని సూచించారు. అంతకీ స్పందించకపోతే అధికార పార్టీకి, ప్రతిపక్ష టీడీపీకి ప్రజలే గట్టి బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఎప్పుడు గద్దె దించుదామా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రజలు ఎన్నికలొస్తే డిపాజిట్లు రాకుండా ఆ రెండు పార్టీలను బంగాళాఖాతంలోకి తోసేస్తారని జగన్‌మోహన్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఈ సభలో మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు, అనకాపల్లి ఎంపీ సబ్బంహరి, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యేలు కుంభా రవిబాబు, తాడ్డి వెంకటరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు సింగ్‌బాబు, గొర్లె వెంకటరమణ, మున్సిపల్ మాజీ చైర్మన్ అవనాపు సూరిబాబు, మొయిద ఎంపీటీసీ సభ్యుడు డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, అవనాపు విజయ్ తదితరులు పాల్గొన్నారు.
జగన్‌ను కలిసిన నాయకులు
 ఓదార్పుయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి భోగాపురంలోని సన్‌రే విలేజ్ రిసార్ట్స్‌లో విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి బుధవారం ఉదయం పూసపాటిరేగ మండలంలో పర్యటించేందుకు బయలుదేరారు. ఈ సమయంలో ఉదయం 7గంటలకు పలువురు సన్‌రే విలేజ్‌కు చేరుకున్నారు. ముందుగా ఏఎంసీ మాజీ చైర్మన్ కాకర్లపూడి శ్రీనివాసరాజు తన కుటుంబ సభ్యులతో వచ్చి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి అభినందించారు.

తరువాత ఎంపీ సబ్బం హరి, భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి సాంబశివరాజు, కాకినాడ డిప్యూటీ మేయర్ వెంకటలక్ష్మి దంపతులు, అనపర్తి ఎమ్మెల్యే నడిమల్లి శేషారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అవనాపు సూరిబాబు కలిశారు.

రాజమండ్రి మాజీ మేయరు ఎంఎస్ చక్రవర్తి, తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మాజీ ఎంపీపీ బి.సుదర్శనరాజు, విశాఖకు చెందిన ఎంఎస్‌ఆర్ ఎస్టేట్స్ ఎండీ ఎం.శ్రీనివాసరాం, తాండవ చైర్మన్ పి.గణేష్, జామి మాజీ ఎంపీపీ కాకర్లపూడి సూరిబాబురాజు, కె.కె.వి.ఎన్.వర్మ, విశాఖపట్నం 17, 43వ వార్డుల సభ్యులు కె.అప్పారావు, హణుక్, విశాఖపట్నానికి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్, ఏపీ టెక్‌నో మాజీ చైర్మన్ కొయ్య ప్రసాదరెడ్డి, ఎలమంచిలి నుంచి న్యాయవాది కె.జగదీష్ తదితరులు జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.
జగన్‌తోనే వైఎస్ పాలన సాధ్యం
వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన స్వర్ణ యుగపు పాలన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే సాధ్యమని నెల్లిమర్ల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, ఆ పార్టీ నాయకులు సింగుబాబు, గొర్లె వెంకటరమణ అన్నారు. మండలంలో మల్యాడ, సతివాడ, నెలిమర్లలో ఓదార్పు యాత్ర సందర్భంగా జరిగిన బహిరంగ సభల్లో వారు ప్రసంగించారు. దివంగత నేత వైఎస్ మరణానంతరం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి మంత్రిని చేశారని వారు గుర్తు చేశారు.

అటువంటి బొత్స వైఎస్‌ఆర్ తనయుడైన జగన్‌మోహనరెడ్డిని కడప ఉప ఎన్నికల్లో ఓడించడానికి జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా వెళ్లడం ఆయన కృతజ్ఞహీనమైన వ్యక్తో ఇదో నిదర్శనమని ఎద్దేవా చేశారు. బొత్స వెళ్ల బట్టే జమ్మలమడుగులో జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక మోజార్టీ వచ్చిందని చెప్పారు. నెల్లిమర్లలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మావూరి శంకరరావు, ఆదాడ మోహనరావు, జనాప్రసాద్ ప్రసంగించారు. మొయిద ఎంపీటీసీ సభ్యుడు పెనుమత్స సురేష్‌బాబు, అవనాపు విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఏజెన్సీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పాగా
కొమరాడ రూరల్, న్యూస్‌లైన్ : ఏజెన్సీ ప్రాంతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాగ వేస్తోంది. ప్రధానంగా గుమ్మలక్ష్మీపురం మండలంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు చేరుతున్నారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. టీడీపీ, సీపీఎం నాయకులు కూడా పార్టీలోకి చేరడానికి సన్నద్ధమవుతున్నారు. ఎంపీపీ తాడంగి దమయంతితో పాటు ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు బుధవారం వైఎస్సార్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ బలం మరింత పెరిగింది. కడప ఎంపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జిల్లాలో మలివిడత ఓదార్పుకు అడుగిడిన వేళ కాంగ్రెస్, టీడీపీ సీపీఎం నాయకులు, కార్యకర్తలు పార్టీలోకి చేరడానికి సిద్ధమవుతున్నారు.
దివంగత నేత వైఎస్‌ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తున్న నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి స్థాపిం చిన చేసిన పార్టీని గుమ్మలక్ష్మీపురం మండలంలో ప్రజలు, గిరిజనులు ఆదరిస్తున్నారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన కరుణాకర రెడ్డి, ద్వారపురెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎంపీపీ తాడంగి దమయంతి, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు, ఇద్దరు ఇండిపెండెంట్లు, టీడీపీకి చెందిన ఒక ఎంపీటీసీ సభ్యుడు చేరారు. మండలంలో 14 ఎంపీటీసీ సభ్యుల్లో ఆరుగురు ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మండలంలో 27 పంచాయతీల్లో కాంగ్రెస్‌కు చెందిన17 మంది సర్పంచ్‌లు, సీపీఎంకు చెందిన ఆరుగురు సర్పంచ్ లు ైవైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు చర్చలు జరుపుతున్నారు.

టీడీపీకి చెందిన నలుగురు సర్పంచ్‌ల్లో ఇప్పటికే ఒకరు చేరగా, మరో సర్పంచ్ చేరడానికి రంగం సిద్ధమైంది. ఈ ప్రస్థానం ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లో గుమ్మలక్ష్మీపురం మండలం మొత్తాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ బౌల్డ్ చేసినట్లేనని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ మండలంతోపాటు కురుపాం నియోజకవర్గానికి చెందిన కొమరాడ, గరుగుబిల్లి, కురుపాం, జియ్యమ్మవలసలు కూడా అదే బాటలో నడుస్తాయి. ఈ నియోజకవర్గంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగిడే నాటికి కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం ఖాళీ అయ్యే పరిస్థితి ఉందని ఆయా పార్టీ నాయకులే అంటున్నారు.
‘ఓదార్పుయాత్రకు తరలిరండి’
బొబ్బిలి రూరల్, న్యూస్‌లైన్ : మండలంలో ఈ నెల 27న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న ఓదార్పు యాత్రకు తరలి రావాలని ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు పిలుపునిచ్చారు. యాత్రలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరంచనున్న మహానేత వైఎస్‌ఆర్ విగ్రహాలను ఆయనతో పాటు తూముల రామసుధీర్ తదితరులు బుధవారం పరిశీ లించారు.

పట్టణంలో అమ్మిగారి కోనేటి గట్టు, పిరిడిలో ఏర్పాటు చేయనున్న విగ్రహాలను వారు పరిశీలించారు. పిరి డి, జగన్నాథపురం తదితర గ్రామాల్లో పాదయాత్ర చేసి ఓదార్పుయాత్రను విజయవంతం చేయాలని కోరారు. పాదయాత్రలో పంపాన శ్రీనివాసరావు, తేలు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో జగన్ మోహన్‌రెడ్డి అభిమానులు బర్ల వెంకటరమణ యాదవ్ ఆధ్వర్యంలో ఓదార్పుపై ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఐవీ రమణమూర్తి, ఐవీఆర్ ఆండాళ్ ఆధ్వర్యంలో ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.


No comments:

Post a Comment