Pages

Wednesday, May 25, 2011

జగన్‌కు జై కొట్టిన అవనిగడ్డ పీఆర్పీ

అవనిగడ్డ (కృష్ణా), న్యూస్‌లైన్: ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలవాలని కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పీఆర్పీ నేతలు, కార్యకర్తలు నిర్ణయించారు. పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయడంపై అసంతృప్తికి గురైన నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు బుధవారం రాత్రి అవనిగడ్డలో సమావేశమయ్యారు. సీనియర్ నేత బోయిన వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 90శాతం మంది వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాలని కోరారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 500మందికి పైగా నాయకులు, కార్యకర్తలు తమ మనోభావాలను నిస్సంకోచంగా వెల్లడించారు. రైతుల ప్రయోజనాల కోసం తపిస్తున్న జగన్మోహనరెడ్డికి మద్దతుగా నిలవడం సరైన నిర్ణయమని పేర్కొన్నారు. మండల స్థాయి నాయకులతో వ్యక్తిగతంగా మాట్లాడి రెండు రోజుల్లో నిర్ణయం వెలువరించనున్నట్లు నియోజకవర్గ ఇన్‌చార్జి సింహాద్రి రమేష్ కార్యకర్తలకు తెలిపారు. ఇది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment