Pages

Wednesday, May 25, 2011

జగన్‌కు న్యాయవాదుల అధ్యక్షుడి మద్దతు

విజయనగరం, న్యూస్‌లైన్: విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ సోదరుడు, జిల్లా న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు రవికుమార్ బుధవారం జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. భోగాపురం వద్ద జగన్ బస చేసిన అతిథి గృహానికి ఆయన రాగా.. మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు ఆయన్ను కడప ఎంపీకి పరిచయం చేశారు.

భారీగా వలసలు: ఓదార్పు యాత్ర రెండో రోజైన బుధవారం వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు వచ్చి జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొవ్వాడలో సర్పంచ్ పి.రామినాయుడు, ఉప సర్పంచ్ కొడ్ల పార్వతి ఆధ్వర్యంలో రెండు వేల మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సతివాడలో ఒమ్మి సర్పంచ్ అంబాళ్ల అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన 200 మంది పార్టీలో చేరారు.

No comments:

Post a Comment