Pages

Wednesday, May 25, 2011

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి ( అనంతపురం )

: రాష్ట్రం లేదా నియోజకవర్గాలు అభివృద్ధి చెం దాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చౌళూరు రామక్రిష్ణారెడ్డి పే ర్కొన్నారు. బుధవారం స్థానిక హస్నాబాద్‌లో టీడీపీకి చెందిన ఇలియా జ్, చాంద్‌బాషా, రెహమాన్, హుస్సేన్, రహంతుల్లా, కలీద్, ఆసీఫ్‌తోపా టు వంద మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చౌళూరు రామక్రిష్ణారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలన్నీ కొనసాగిం చాలంటే వైఎస్ జగన్మోహన్‌రెడ్డికే సాధ్యమన్నారు.

నియోజకవర్గ ఎమ్మె ల్యే, ము న్సిపల్ చైర్మన్ పురం అభివృద్ధిని విస్మరించారన్నారు. రాబోవు ఎన్నికల్లో వీరికి గుణపాఠం చెప్పక తప్పదన్నారు. హస్నాబాద్‌లో వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేకపోయారని వాపోయా రు. మెరుగైన సౌకర్యాలు, మెరుగైన అభివృద్ధి జరగాలంటే వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన కోరారు. పార్టీలోకి చేరిన వారు మాట్లాడుతూ మహానేత హిందూపురం పట్టణానికి రూ.650 కోట్లు ఖర్చు చేసి తాగునీటి సమస్య తీర్చారన్నారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేలా ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఆయన ఆశయాలు కొనసాగించేందుకు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలోకి చేరామన్నారు. కార్యక్రమంలో అన్వర్, ముస్తాఫా, చోటు, ఆటో దాదు, బాబు, రెహమాన్, ఫయాజ్, కౌన్సిలర్ సమీవుల్లా, చాంద్‌బాషా, ఫకృద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment