Pages

Wednesday, May 25, 2011

అవిశ్వాసం పెడితే మద్దతు: జగన్

విజయనగరం: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ప్రజలపై ప్రేమ ఉండి శాసనసభలో అవిశ్వాసతీర్మానం ప్రవేశపెడితే, తాము కూడా మద్దతు పలుకుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. ఓదార్పు యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా మోయిదా జంక్షన్ లో రాత్రి 8 గంటలకు జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈరోజు ప్రతిపేదవాడు, ప్రతి రైతు ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా అని ఎదురు చూస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీ మాత్రం వారి గోడుని పట్టించుకునే పరిస్థితిలేదన్నారు. రైతులపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తారని విమర్శించారు. ఆ నాడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సువర్ణపాలన సాగుతున్న సమయంలో కేవలం 46 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని చెప్పారు. ఇప్పుడు జనం అందరూ కోరుతున్నా, టిడిపికి 90 మంది ఎమ్మెలు ఉన్నా అవిశ్వాసం తీర్మానం పెట్టడంలేదని అన్నారు. జనంపై ప్రేమ ఉంటే ఈ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్నారు. జగన్ కు మద్దతు పలికేవారందరూ ఆ తీర్మానానికి మద్దతుగా మద్దతుగా ఓటు వేస్తారని చెప్పారు.

సభకు జనం భారీగా తరలివచ్చారు. మాజీ మంత్రి పెన్మచ్చ సాంబశివరాజు, ఎంపి సబ్బం హరి ఆయన వెంట ఉన్నారు.

No comments:

Post a Comment