Pages

Sunday, May 29, 2011

వైఎస్‌ఆర్ పాలన సువర్ణ యుగం: జగన్

గుమ్మలక్ష్మిపురం:రాజశేఖరరెడ్డి పాలన సువర్ణయుగమని.. రాజశేఖరరెడ్డి సువర్ణపాలనలో రైతులు ఏనాడు కూడా బాధలు పడలేదన్నారు. రైతుల్లో రాజశేఖరుడు ఉన్నాడనే భరోసా వుండేదన్నారు. రాజశేఖరరెడ్డి పాలనలో రైతులు మద్దతు ధర కంటే ఎక్కువ ధరకే ధాన్యం అమ్ముకున్నారన్నారు.

విజయనగరం జిల్లాలో ఆరవ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా గుమ్మలక్ష్మిపురంలో ఏర్పాటు చేసిన సభలో జననేత జగన్మోహన్‌రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

దివంగత నేత పాలనలో తన కూతురు డాక్టరవుతారనే ఆశ, కొడుకు ఇంజినీరింగ్ అవుతాడన్న కోరిక ప్రతి తండ్రి కళ్లలో కనిపించేదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆడపడుచును లక్షాధికారిని చేయాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పావలా వడ్డీకే రుణాలను మంజూరు చేశారన్నారు.

గుమ్మలక్ష్మిపురంలో ఎండలు మండుతున్నప్పటికి యువనేతకోసం ప్రజలు రోడ్లపై ఎదురుచూస్తు నిలుచున్నారు. జననేత చూసేందుకు జనం ఎగబడ్డారు. జగన్ యాత్రకు జనం భారీగా హాజరయ్యారు. ఆయన మాట్లాడిన ప్రతి మాటకు ప్రజల నుంచి స్పందన వెలువడింది.

No comments:

Post a Comment