Pages

Sunday, May 29, 2011

జగన్‌ను అభాసుపాలు చేయడానికే...: అంబటి

హైదరాబాద్: యువనేత జగన్మోహన్‌రెడ్డిని అభాసుపాలు చేయడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మకైనాయని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి తప్పు చేశామని మహానాడులో చంద్రబాబు తెలుపడం కాంగ్రెస్ పార్టీతో బాబు చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనని ఆయన విమర్శించారు.

మాజీ కేంద్రమంత్రి రాజా, కనిమొళిలా జగన్‌ను జైలుకు పంపిస్తామని చంద్రబాబు చెంచాలు మాట్లాడం చూస్తూంటే కాంగ్రెస్‌తో కుమ్మకైనారని అర్ధమౌతోందని ఆయన అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటల్నే తెలుగుదేశం పార్టీ వల్లవేస్తోందన్నారు. చంద్రబాబు మేకవన్నే పులి అని ఆయన వ్యాఖ్యానించారు. ఆహ్మద్ పటేల్‌తో బాబు రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆయన అన్నారు.

No comments:

Post a Comment