Pages

Tuesday, May 31, 2011

జగన్‌కు జైకొట్టాల్సిందే..

వంగవీటి రాధాపై రంగా అభిమానుల ఒత్తిడి
విజయవాడ, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వంగవీటి రాధా మద్దతు ప్రకటించాలని రంగా అభిమానుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నట్లు రాధా మేనమామ చెన్నుపాటి శ్రీనివాసరావు చెప్పారు.మంగళవారం నగరంలో సినీనటుడు కృష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా రంగా అభిమానులు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వంగవీటి రాధా బొమ్మలతో భారీఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలలో వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఉండటంతో రాధా జగన్‌కు జై కొడుతున్నారని నగరంలో పెద్దఎత్తున చర్చ జరిగింది. రాధాను మొదటి నుంచి అన్నీ తానై నడిపిస్తున్న ఆయన మేనమామ చెన్నుపాటి శ్రీనివాస్ దీనిపై స్పందిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరాలని అభిమానుల ఒత్తిడి ఇంతలా ఉంటుందని తాము ఊహించలేదనీ, త్వరలోనే దీనిపై ఓ ప్రకటన చేస్తామన్నారు.

No comments:

Post a Comment