Pages

Sunday, May 15, 2011

ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి: జూపూడి

కూకట్‌పల్లి, న్యూస్‌లైన్: కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయినందుకు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఎంఎల్‌సీ జూపూడిప్రభాకర్‌రావు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి విజయం సాధించిన సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపూడి నివాసంలో మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం జూపూడి మాట్లాడుతూ వైఎస్ కష్టంతో తీసుకొచ్చిన ప్రభుత్వంలో కిరణ్‌కుమార్ రెడ్డికొనసాగే అర్హతలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సూర్యప్రకాశరావు, కేపీహెచ్‌బీ వైఎస్సార్ పార్టీ నాయకుడు జార్జిహెర్బెట్, సుబ్బలక్ష్మీ, రాంబాబు, మనోహర్, చంద్రశేఖర్, మల్లిఖార్జున్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment