Pages

Sunday, May 15, 2011

అన్నదాతకు అండగా జగన్


గుంటూరు సెంట్రల్, న్యూస్‌లైన్: రాష్ట్ర భావినేత వైఎస్ జగన్ మాత్రమేనని పశ్చిమగోదావరి జిల్లా గణపవరం జెడ్పీటీసీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు నవుడు వెంకటరమణ తెలిపారు. గుంటూరులో వైఎస్ జగన్ చేపట్టనున్న రైతు దీక్షకు తరలివచ్చిన ఆయనదీక్షా ప్రాంగణాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్ ఏ మాత్రం గర్వపడకుండా నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారని తెలిపారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నారని చెప్పారు. రాష్ర్టంలోనే ఇలాంటి వ్యక్తి జగన్ ఒక్కరేనన్నారు. యువనేతను సీఎంగా చూసేందుకు రాష్ట్ర ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని తెలిపారు. పంటకు గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వాలు అన్నదాతను నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితుల్లో జగన్ దీక్ష చేపట్టారని చెప్పారు. దీక్షకు రైతులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని తెలిపారు. మండుటెండలను లెక్క చేయకుండా రైతు సమస్యల పరిష్కారం కోసం జగన్ పోరాడటం అభినందనీయమన్నారు.

No comments:

Post a Comment