Pages

Sunday, May 22, 2011

నేడు సీబీఎస్‌ఈ ఫలితాల విడుదల

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) పన్నెండో తరగతి ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి www.results.nic.in, www.cbseresults.nic.in, www.cbse.nic.in వెబ్‌సైట్ల ద్వారా, లేదా 011-24357270 నంబర్‌కు ఫోన్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చని సీబీఎస్‌ఈ అధికారి ఒకరు తెలిపారు. ఎంటీఎన్‌ఎల్ వినియోగదారులైతే 011-28127030 నంబర్‌లో సంప్రదించి ఫలితాలు పొందవచ్చని చెప్పారు. కాగా పాట్నా మినహా దేశ వ్యాప్తంగా సోమవారం ఫలితాలను ప్రకటిస్తామని, ఆ ప్రాంతంలో మాత్రం ఈ నెల 27న విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది దాదాపు 7,69,929 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.

No comments:

Post a Comment