Pages

Monday, May 30, 2011

విజయనగరం జిల్లాలో ముగిసిన ఓదార్పుయాత్ర

విజయనగరం: జిల్లాలో రెండవ విడత ఓదార్పు యాత్ర ముగిసింది. ఈ యాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన రెడ్డి 18 కుంటుంబాలను ఓదార్చారు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ వందకుపైగా విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ యాత్ర 950 కిలో మీటర్లకుపైగా సాగింది.

జగన్ యాత్ర నిర్వహించిన ప్రతి గ్రామంలో అపూర్వ స్వాగతం లభించింది. అభిమానులు, కార్యకర్తలు, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల ప్రజలు ఆయనని చూసేందుకు తరలివచ్చారు. ఆయన రాక ఆలస్యం అయినా మండుటెండని కూడా లెక్కచేకుండా వేచి ఉండటం విశేషం. జగన్ లో జనం ఆ మహానేతని చూసుకుంటున్నారు.

విజయనగరంలో జరిగిన ముగింపు సభకు ఇసుకవేస్తే రాలనంతమంది జనం వచ్చారు. వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. మేడలపైన, మిద్దెలపైన ఎటుచూసినా జనమే జనం.

No comments:

Post a Comment