Pages

Monday, June 13, 2011

రైతుల పరిస్థితి దుర్భరం: జగన్

చిత్తూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఈ జిల్లా వారైనప్పటికీ ఇక్కడ రైతుల పరిస్థితి దుర్భరంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన రైతుపోరు కార్యక్రమానికి రైతులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రబీలో పండించిన ధాన్యాన్ని కూడా అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఉన్నారన్నారు. గూడౌన్లలో నిల్వ చేసుకునే అవకాశంలేదని, కొనేవాడు కూడా లేడని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులు తాము పండించిన పంటని పోలాల్లోనే ఉంచుకోవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు. రైతుల కన్నీటికి ఈ ప్రభుత్వం జవాబు చెప్పాలని ఆయన అన్నారు. ప్రతి రైతు సోదరుడికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని భరోసా ఇచ్చారు. ఇక్కడి రైతులు పడుతున్న బాధలను వివరిస్తూ కలెక్టర్­కు వినతి పత్రం ఇస్తానని చెప్పారు.

విత్తన వ్యాపారులతో ప్రభుత్వం లాలూచీపడిందని జగన్ ఆరోపించారు. తగినన్ని విత్తనాలు సరఫరా చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు.90 లక్షల విత్తనాల ప్యాకెట్లు అవసరం కాగా, 40 లక్షలు మాత్రమే సరఫరా చేశారని చెప్పారు.

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సువర్ణయుగం నడుస్తున్నవేళ ప్రతిపక్ష నేత అయిన ఈ చంద్రబాబు నాయుడు గద్దె దింపడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు. ఇవాళ 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడంలేదని చంద్రబాబుని ఆయన ప్రశ్నించారు. స్పీకర్ ఎన్నికల్లో పోటీ పెట్టే సాంప్రదాయంలేకపోయినా ఆ ఎన్నికని రాజకీయం చేశారని విమర్శించారు. ఆ రెండు రోజులు స్పీకర్ ఎన్నిక గురించిమాత్రమే మాట్లాడారని, ఒక్క రోజు కూడా రైతుల బాధల గురించి మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కైయ్యాయని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆ రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారన్నారు

No comments:

Post a Comment